

ఎన్. చంద్రశేఖరన్ టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవడంతో టాటా ట్రస్ట్స్, టాటా సన్స్ మధ్య కొనసాగుతున్న గవర్నెన్స్ వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ట్రస్టీలు వేణు శ్రీనివాసన్, విజయ్ సింగ్ టాటా ట్రస్ట్స్, టాటా సన్స్లో కీలక నిర్ణయ ప్రక్రియల్లో భాగస్వాములుగా ఉన్నారు. టాటా సన్స్ను అన్లిస్టెడ్గా కొనసాగించే నిర్ణయంలో పాల్గొన్న వీరిద్దరూ తర్వాత హోల్డింగ్ కంపెనీని లిస్ట్ చేయాలని మద్దతు ఇవ్వడం వివాదానికి కారణమైంది.
ట్రస్టీలుగా కొనసాగుతూ తాము పాలనలో భాగమైన సంస్థకు సంబంధించి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేయడం, ఫిర్యాదులు చేయడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు న్యాయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. రతన్ టాటా 2024 అక్టోబర్లో మరణించిన తర్వాత ట్రస్ట్స్లో గవర్నెన్స్ అంశాలపై చర్చలు మరింత పెరిగినట్లు సమాచారం. అప్పటి టాటా ట్రస్టీ మెహ్లీ మిస్త్రీ కొన్ని నిర్ణయాలపై ప్రశ్నలు లేవనెత్తారని, 75 ఏళ్లకు పైబడిన విజయ్ సింగ్ టాటా సన్స్ బోర్డులో కొనసాగడంపైనా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!