

బాలీవుడ్ నటి అనన్య పాండే సోషల్ మీడియాలో వచ్చే నెగెటివిటీ, ట్రోలింగ్పై స్పందించారు. ఆన్లైన్ విమర్శలను చూసి భయపడాల్సిన అవసరం లేదని ఆమె సూచించారు. మనపై నెగెటివిటీ వచ్చినప్పుడు కాస్త వెనక్కి తగ్గి ప్రశాంతంగా ఆలోచిస్తే, ఇలాంటి పరిస్థితులు ఒక్క మనకే కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరికీ ఎదురవుతున్నాయని అర్థమవుతుందని చెప్పారు. విజయవంతంగా, ఆత్మవిశ్వాసంతో కనిపించే వారు కూడా ఆన్లైన్ విమర్శలను ఎదుర్కొంటారని, ఈ విషయాన్ని గుర్తిస్తే ట్రోలింగ్ ప్రభావం, భయం తగ్గుతాయని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే, తాను ఇప్పటివరకు పనిచేయని పలువురు ప్రముఖ దర్శకులతో కలిసి పనిచేయాలనే కోరిక ఉందని అనన్య పాండే వెల్లడించారు. కరణ్ జోహార్, జోయా అక్తర్, సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో నటించడం తన డ్రీమ్ లిస్ట్లో ఉందని తెలిపారు. ఈ ముగ్గురు అగ్ర దర్శకులతో కలిసి పనిచేసే అవకాశం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఆమె చెప్పారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!