28, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

“సీఎం రేవంత్‌పై కేంద్రానికి ఎలాంటి వివక్ష లేదు” — ఎంపీ ఈటల రాజేందర్

Writer: Chandrika 08:48 PM, 28 ఆగస్టు, 2026
“సీఎం రేవంత్‌పై కేంద్రానికి ఎలాంటి వివక్ష లేదు” — ఎంపీ ఈటల రాజేందర్

ప్రపంచ వేదికలపై రాహుల్‌ గాంధీ భారతదేశంపై విమర్శలు చేస్తున్నారని, సీఎం రేవంత్‌ రెడ్డి కూడా అదే బాటలో నడుస్తున్నారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ఆరోపించారు. అయితే రేవంత్‌ రెడ్డిపై కేంద్రానికి ఎలాంటి వివక్ష లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అడిగిన దానికంటే ఎక్కువ నిధులను కేంద్రం కేటాయించిందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఐదు కిలోల బియ్యం అందిస్తున్నప్పటికీ రేషన్‌ కార్డులపై ఆయన ఫొటో లేకపోవడం, కిలో బియ్యం అందిస్తున్న రేవంత్‌ రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఫొటోలు పెట్టుకోవడంపై ఈటల ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వం మారితే మళ్లీ రేషన్‌ కార్డులు ముద్రిస్తారా? ప్రజాధనాన్ని ఇలా ఖర్చు చేస్తారా? అని ప్రశ్నిస్తూ సీఎం రేవంత్‌ రెడ్డి సంకుచితంగా వ్యవహరించవద్దని సూచించారు.

మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గంలోని రైల్వే, మున్సిపల్‌ పనులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజుతో భేటీ అనంతరం సచివాలయంలో మీడియాతో ఈటల మాట్లాడారు. గతంలో రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం, రాష్ట్రం సంయుక్తంగా నిధులు ఖర్చు చేసేవని, ప్రస్తుతం రైల్వే శాఖే 100 శాతం నిధులు సమకూరుస్తోందని తెలిపారు. మేడ్చల్‌ నుంచి సికింద్రాబాద్‌ వరకు 23 రైల్వే గేట్ల వద్ద ఆర్‌యూబీల నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా.. ఎన్‌ఓసీలు, ట్రాఫిక్‌ డైవర్షన్‌ వంటి అంశాల్లో సహకారం అవసరమన్నారు. హైదరాబాద్‌లోని రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. మల్కాజిగిరి పరిధిలోని మూడు మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచినా చెల్లింపులపై అనిశ్చితితో కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదన్నారు. అర్బన్‌, రూరల్‌ హౌసింగ్‌ పథకాల కింద కేంద్రం నిధులు అందిస్తుందని, వాటిని పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మెట్రో ఫేజ్‌-1, ఫేజ్‌-2కు కేంద్రం సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. హైదరాబాద్‌లో రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, ఇతర కనీస పౌర సదుపాయాలను మెరుగుపరచాలని కోరినట్లు ఈటల వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాఖీ పండుగనూ వదలని రాజకీయ విభేదాలు..

రాఖీ పండుగనూ వదలని రాజకీయ విభేదాలు..

సూర్యాపేటలో పోలీసుల దౌర్జన్యంపై హరీశ్‌రావు ఆగ్రహం..

సూర్యాపేటలో పోలీసుల దౌర్జన్యంపై హరీశ్‌రావు ఆగ్రహం..

యశ్‌ ‘టాక్సిక్‌’పై అన్నామలై విమర్శలు..

యశ్‌ ‘టాక్సిక్‌’పై అన్నామలై విమర్శలు..

డీలిమిటేషన్‌మహిళా రిజర్వేషన్ల అంశంపై కేంద్రం ఫోకస్

డీలిమిటేషన్‌మహిళా రిజర్వేషన్ల అంశంపై కేంద్రం ఫోకస్

పీసీసీ చీఫ్ షాక్ ఇచ్చిన ఈసీ...

పీసీసీ చీఫ్ షాక్ ఇచ్చిన ఈసీ...

జెన్ జీ నిరసనలు, ప్రజాస్వామ్య వ్యవస్ధపై ఎంపీ శశిథరూర్ ప్రశంసలు

జెన్ జీ నిరసనలు, ప్రజాస్వామ్య వ్యవస్ధపై ఎంపీ శశిథరూర్ ప్రశంసలు

ట్యాగ్లు
ఈటల రాజేందర్‌రేవంత్‌ రెడ్డితెలంగాణ రాజకీయాలుమల్కాజిగిరి ఎంపీకేంద్ర ప్రభుత్వంరైల్వే ప్రాజెక్టులుహైదరాబాద్‌ అభివృద్ధిమెట్రో రైలుమున్సిపల్‌ పనులుతెలంగాణ మౌలిక వసతులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మైక్రోడక్‌తో ఏఐ రోబోటిక్స్‌లో కొత్త ప్రయోగం...
టెక్నాలజీ

మైక్రోడక్‌తో ఏఐ రోబోటిక్స్‌లో కొత్త ప్రయోగం...

ఏఐ ఏజెంట్లకు యంత్రాల భాష నేర్పే సరికొత్త స్టాండర్డ్‌...
టెక్నాలజీ

ఏఐ ఏజెంట్లకు యంత్రాల భాష నేర్పే సరికొత్త స్టాండర్డ్‌...

రాఖీ పండుగనూ వదలని రాజకీయ విభేదాలు..
రాజకీయాలు

రాఖీ పండుగనూ వదలని రాజకీయ విభేదాలు..

తిరుపతి ఎస్వీ జూలో వరుసగా మూడు చిరుతల మృతి..
జనరల్

తిరుపతి ఎస్వీ జూలో వరుసగా మూడు చిరుతల మృతి..

“విరాట్‌ కోహ్లీ ఉంటే మ్యాచ్‌ ఫలితం మరోలా ఉండేది” - మహ్మద్‌ కైఫ్‌
క్రీడలు

“విరాట్‌ కోహ్లీ ఉంటే మ్యాచ్‌ ఫలితం మరోలా ఉండేది” - మహ్మద్‌ కైఫ్‌

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో మరో సంచలనం..
జనరల్

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో మరో సంచలనం..

సుభాష్‌ చంద్ర రుణ సెటిల్‌మెంట్‌లో కీలక మలుపు..
జనరల్

సుభాష్‌ చంద్ర రుణ సెటిల్‌మెంట్‌లో కీలక మలుపు..

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ‘ఖేలో తెలంగాణ హాకీ లీగ్‌’ ఫైనల్‌..
క్రీడలు

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ‘ఖేలో తెలంగాణ హాకీ లీగ్‌’ ఫైనల్‌..

“సీఎం రేవంత్‌పై కేంద్రానికి ఎలాంటి వివక్ష లేదు” — ఎంపీ ఈటల రాజేందర్
రాజకీయాలు

“సీఎం రేవంత్‌పై కేంద్రానికి ఎలాంటి వివక్ష లేదు” — ఎంపీ ఈటల రాజేందర్

నేపాల్‌ వరదల్లో పెరిగిన మృతుల సంఖ్య..
జనరల్

నేపాల్‌ వరదల్లో పెరిగిన మృతుల సంఖ్య..

నాగబాబుకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్...
జనరల్

నాగబాబుకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్...

సికింద్రాబాద్‌, లింగంపల్లి స్టేషన్లలో ట్రాఫిక్‌ రద్దీకి చెక్‌..
జనరల్

సికింద్రాబాద్‌, లింగంపల్లి స్టేషన్లలో ట్రాఫిక్‌ రద్దీకి చెక్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!