

రాఖీ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ రాజకీయ కుటుంబాల్లో అన్నాచెల్లెళ్ల అనుబంధంపై ఆసక్తికర చర్చ మొదలైంది. తెలంగాణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విదేశీ పర్యటనలో ఉండటంతో ఆయన సోదరి కవిత ఈసారి అన్నకు రాఖీ కట్టలేకపోయారు. రాఖీ పండుగ రోజున అన్నాచెల్లెళ్లు సంప్రదాయబద్ధంగా జరుపుకునే వేడుకకు కేటీఆర్ దూరంగా ఉండటంతో ఈ అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇక ఆంధ్రప్రదేశ్లో వైఎస్ కుటుంబంలోనూ రాఖీ వేడుకలు జరగకపోవడం ఆసక్తిని రేకెత్తించింది. వైఎస్ జగన్ తాడేపల్లి నివాసంలోనే ఉన్నప్పటికీ కుటుంబ, రాజకీయ విభేదాల నేపథ్యంలో ఆయన సోదరి వైఎస్ షర్మిల రాఖీ కట్టలేదని సమాచారం. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా భావించే రాఖీ పండుగ రోజున తెలుగు రాష్ట్రాల్లోని ఈ రెండు ప్రముఖ రాజకీయ కుటుంబాల్లో కనిపించిన పరిస్థితులు చర్చకు దారితీశాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!