

నేపాల్లో ప్రకృతి విపత్తు తీవ్రత కొనసాగుతోంది. వరదలు, ఇతర పరిణామాల కారణంగా మృతుల సంఖ్య 538కు చేరినట్లు సమాచారం. మరోవైపు ఇప్పటివరకు 121 మంది విదేశీ పౌరులను రక్షించినట్లు అధికారులు ప్రకటించారు. రక్షించబడిన వారిలో 85 మంది భారతీయులు, 16 మంది చైనీయులు, 8 మంది దక్షిణ కొరియన్లు, ఇద్దరు అమెరికన్లు, ఇద్దరు రష్యన్లు, ఇద్దరు ఇటాలియన్లు ఉన్నారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక, రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయి.
రసువా సొరంగంలో చిక్కుకున్న ప్రజలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ను ముమ్మరం చేశారు. ఇదిలా ఉండగా, హిమనీనదం కూలిపోవడం వల్లే ఈ విపత్తు సంభవించిందని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న విదేశీ పౌరులను రక్షించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని చైనా తెలిపింది. గల్లంతైన వారిని గుర్తించడం, చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, బాధితులకు సహాయం అందించడంపై అధికారులు దృష్టి సారించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!