.jpg&w=3840&q=75)
రాజకీయాలు

సోషల్ మీడియాలో తనపై జరిగిన వేధింపులపై రేణు దేశాయ్ ఫిర్యాదు చేయడంతో సైబరాబాద్ పోలీసులు చర్యలు తీసుకుని గుంటూరుకు చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. చెన్నయ్య రుంజాల అనే వ్యక్తి తన యూట్యూబ్ ఖాతా ద్వారా రేణు దేశాయ్ రీల్పై అసభ్యకరమైన వ్యాఖ్య చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.
నిందితుడు గుంటూరులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లి అతడిని అదుపులోకి తీసుకుని గచ్చిబౌలిలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. విచారణలో అతను తన ఫోన్ నుంచే ఆ వ్యాఖ్య చేసినట్లు అంగీకరించాడు. తనపై జరుగుతున్న ఆన్లైన్ వేధింపులపై చర్యలు తీసుకోవాలని రేణు దేశాయ్ ఫిర్యాదు చేయగా, విడాకుల తర్వాత కూడా తాను ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆమె వెల్లడించారు.










.jpg&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!