
రాజకీయాలు

వొడాఫోన్ ఐడియా తన 5జీ సేవలను విస్తరించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ ఏడాది మే నాటికి మరో 90 నగరాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం 43 నగరాల్లో ఉన్న సేవలు, విస్తరణతో 133 నగరాలకు పెరగనున్నాయి. మెట్రో నగరాలు, ఇండస్ట్రియల్ కారిడార్లు, చిన్న పట్టణాల్లో సేవలను విస్తరించడంపై దృష్టి సారిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ సహా 15 టెలికాం సర్కిల్స్లో ఈ సేవలను విస్తరించనుంది. హైదరాబాద్, తిరుపతి వంటి నగరాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇప్పటికే జియో, ఎయిర్టెల్ సంస్థలు దేశవ్యాప్తంగా 5జీ సేవలను విస్తరించగా, ఇప్పుడు వొడాఫోన్ ఐడియా కూడా నెట్వర్క్ నాణ్యతపై దృష్టి పెట్టి వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!