

ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఉన్న రామాలయంలో ఈ రోజు (శుక్రవారం) శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ప్రాణప్రతిష్ఠ అనంతరం మూడో శ్రీరామనవమి కావడంతో ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రామ్లల్లా నుదుటిపై కనిపించిన సూర్య తిలకం అద్భుత దృశ్యాన్ని చూసి భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. మూడో అంతస్తు నుంచి సూర్య కిరణాలు నేరుగా బాలరాముడి నుదుటిపై పడేలా పది మంది శాస్త్రవేత్తల బృందం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆధునిక శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రత్యేక సెటప్ను రూపొందించారు.
మధ్యాహ్నం 12 గంటలకు సుమారు 5.8 సెంటీమీటర్ల పొడవుతో సూర్య కిరణాలు రామ్లల్లా నుదుటిపై పడగా, ఈ సూర్య తిలకం దాదాపు 3.50 నిమిషాల పాటు భక్తులను ఆకట్టుకుంది. విదేశాల నుంచి తెప్పించిన అద్దాలు, లెన్స్లను ఉపయోగించి మూడో అంతస్తు నుంచి సూర్యకాంతిని నేరుగా బాలరాముడి నుదుటిపైకి మళ్లించడం ద్వారా ‘సూర్య తిలకం’ ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. అనంతరం నవమి సందర్భంగా ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుల అభ్యర్థన మేరకు శాస్త్రవేత్తల బృందం ఈ సూర్య తిలకాన్ని ఆవిష్కరించింది. ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి రోజున మధ్యాహ్న సమయంలో సూర్య తిలకం కనిపించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయోధ్య చరిత్రలో ఇది అత్యంత ఘనమైన రామనవమి ఉత్సవంగా నిలిచిందని, ఈ సూర్య తిలకం వికసిత భారతం తీసుకునే ప్రతి సంకల్పాన్ని తన దివ్య శక్తితో మరింత ప్రకాశవంతం చేస్తుందని భావిస్తున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా అయోధ్యకు భక్తులు భారీగా తరలివచ్చారు. వేలాది మంది దూర ప్రాంతాల నుంచి చేరుకున్నారు. అయోధ్య అంతటా “జై శ్రీ రామ్” నినాదాలతో మార్మోగింది. జిల్లా యంత్రాంగం పలు ప్రాంతాల్లో పోలీసు బలగాలను మోహరించి కట్టుదిట్టమైన భద్రతా చర్యలను అమలు చేసింది.












.jpg.webp&w=3840&q=75)




.jpeg&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!