
రాజకీయాలు

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నక్సలిజంపై కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్సభలో మాట్లాడుతూ, ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలో నక్సలిజం దాదాపు అంతమైందని తెలిపారు. ప్రస్తుతం అక్కడ మావోయిస్టుల ప్రభావం చాలా తగ్గిపోయిందని, ఆదివాసీలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని చెప్పారు.
గత మూడేళ్లలో 706 మంది మావోయిస్టులు హతమయ్యారని, 4,800 మందికిపైగా లొంగిపోయారని వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం రెండు ప్రాంతాల్లో మాత్రమే మావోయిస్టుల ప్రభావం ఉందని పేర్కొన్నారు. అభివృద్ధి జరుగుతున్న సమయంలో ఆయుధాలు పట్టుకోవడం సమంజసం కాదని ఆయన వ్యాఖ్యానించారు.









-1774425417157.webp&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!