

ఆర్సీబీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) ఫ్రాంచైజీని ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ కన్సార్టియంలో సత్యన్ గజ్వానీ (టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్), ప్రపంచంలో అతిపెద్ద ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్స్టోన్, అలాగే అమెరికన్ స్పోర్ట్స్ ఇన్వెస్టర్ డేవిడ్ బ్లిట్జర్ ఉన్నారు.
వివరాల ప్రకారం, ఈ కన్సార్టియం ద్వారా ఆర్సీబీని సుమారు రూ.16,705 కోట్లకు విక్రయించినట్లు నివేదికలు చెబుతున్నాయి. 2008లో ఆర్సీబీ ఫ్రాంచైజీ విలువ సుమారు రూ.446 కోట్లుగా ఉండగా, 2026 నాటికి దాని విలువ గణనీయంగా పెరిగి రూ.16,705 కోట్ల స్థాయికి చేరినట్లు తెలుస్తోంది.
గత కొన్ని సంవత్సరాల్లో ఆర్సీబీ ఫ్రాంచైజీ విలువ భారీగా పెరగడం, ఐపీఎల్ బ్రాండ్ మరియు జట్టు మార్కెట్ క్రేజ్ ఎంతగా పెరిగిందో సూచిస్తోంది. ఈ ఒప్పందం క్రీడా పెట్టుబడుల రంగంలో ఒక కీలక పరిణామంగా భావిస్తున్నారు.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!