

తిరుపతిలోని పద్మావతీ మహిళా యూనివర్సిటీలో నిర్వహించిన పీ4 వార్షికోత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గాలని అన్నారు. ప్రతి ఒక్కరికీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలని, సమాజం నుంచి లబ్ధి పొందిన వారు తిరిగి సమాజానికి సేవ చేయాలని సూచించారు. పేదలను ఆదుకునేందుకు ముందుకొచ్చిన మార్గదర్శులను అభినందించారు.
కేవలం డబ్బు ఇవ్వడం సరిపోదని, వారికి మార్గదర్శకత్వం అందిస్తూ మెరుగైన స్థాయికి తీసుకెళ్లాలని సీఎం అన్నారు. పేదల జీవన ప్రమాణాలు పెంచడం పీ4 కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. భవిష్యత్తులో వచ్చే సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఏడాది నుంచి పీ4 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, తొలి ఏడాదిలో మంచి ప్రారంభం జరిగినట్లు పేర్కొన్నారు.
సమాజమే మన కుటుంబమని, ప్రతి ఒక్కరూ తమ ఆదాయంలో కనీసం 10 శాతం పేదల కోసం ఖర్చు చేస్తే గొప్ప తృప్తి లభిస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించే విధంగా అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
.jpg&w=3840&q=75)





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!