

వెలిగొండ ప్రాజెక్టును వచ్చే జులై నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సుమారు 30 ఏళ్ల క్రితం మార్కాపురం పర్యటనలో ప్రజలు తాగునీటి సమస్యను వివరించగా శ్రీశైలం నీటిని అందించే లక్ష్యంతో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినట్లు ఆయన గుర్తుచేశారు. పెద్దదోర్నాల మండలం గంటవానిపల్లె సమీపంలో రూ.436 కోట్లతో చేపట్టిన ఫీడర్ కాలువ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం, సొరంగ పనులను దృశ్య మాధ్యమం ద్వారా పరిశీలించి ఇంజినీర్లు, అధికారులతో ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష నిర్వహించారు. పూర్తికాని ప్రాజెక్టును 2024లో జాతికి అంకితం చేశామని గత ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టించిందని ఆయన విమర్శించారు.
మార్కాపురంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఈ ఏడాది వెలిగొండ, వచ్చే ఏడాది పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేయడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు తాగునీరు అందించేందుకు వేగంగా పనులు కొనసాగుతున్నాయని, జులై నాటికి నీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. రైతులతో మాట్లాడిన సీఎం, భూగర్భజలాల కొరతతో ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలను ఉద్యానవన హబ్గా అభివృద్ధి చేసి, పంటల నాణ్యతను అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా పెంచేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!