
క్రీడలు

ఉత్తరప్రదేశ్లోని వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ భారీ వృక్షారోపణ కార్యక్రమంతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. కేవలం ఒక గంటలోనే సుమారు 2.5 లక్షల మొక్కలను నాటి ఈ మెగా డ్రైవ్ను విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 20 వేల మందికి పైగా పౌరులు పాల్గొని పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించారు. నగరంలో పచ్చదనాన్ని పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ మెగా డ్రైవ్ను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు అధికారికంగా గుర్తించి ధృవీకరించారు. వారణాసి ఎంపీగా ప్రధాని నరేంద్ర మోదీ ఉన్న నేపథ్యంలో ఈ విజయానికి దేశవ్యాప్తంగా ప్రాధాన్యం లభించింది. పర్యావరణ సంరక్షణలో ప్రజల భాగస్వామ్యానికి ఇది గొప్ప ఉదాహరణగా నిలిచిందని అధికారులు పేర్కొన్నారు.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!