
సినిమాలు

ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలకల క్వారీ దగ్గర హరికృష్ణ ట్రావెల్స్కు చెందిన ప్రైవేట్ బస్సు టిప్పర్ లారీని ఢీకొట్టింది. ఢీకొట్టిన వెంటనే బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది.
జగిత్యాల నుంచి వింజమూరు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొదటగా 10 మంది సజీవదహనం అయినట్లు సమాచారం వచ్చింది. స్థానికులు మరియు అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
తాజా సమాచారం ప్రకారం మృతుల సంఖ్య 13కు చేరింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


















.png&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!