

లోక్సభ మరియు రాష్ట్ర అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధిత్వాన్ని విస్తరించేందుకు సుమారు 50 శాతం వరకు సీట్లను పెంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రతిపాదన ప్రకారం, లోక్సభ స్థానాలు ప్రస్తుతం ఉన్న 543 నుంచి 816కి పెరగనున్నాయి. అలాగే రాష్ట్ర అసెంబ్లీ స్థానాలు 4,123 నుంచి 6,185కి పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్రాల వారీగా కూడా ఈ మార్పులు ఉండనున్నాయి. తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 179కి, ఆంధ్రప్రదేశ్లో 263కి పెరిగే అవకాశం ఉంది.
ఈ అంశంపై బిల్లు ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. 2029 సాధారణ ఎన్నికల నుంచి ఈ మార్పులను అమల్లోకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నిర్ణయాన్ని ఎన్డీఏ సమావేశంలో భాగస్వామ్య పక్షాలకు కేంద్ర ప్రభుత్వం వెల్లడించినట్లు తెలిసింది.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!