

విజయవాడ టెర్రర్ లింక్ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్కు చెందిన సైదాబేగం, బెంగళూరుకు చెందిన అబ్దుల్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు విజయవాడ పోలీసులు తెలిపారు. ఈ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయని అధికారులు వెల్లడించారు.
పోలీసుల సమాచారం ప్రకారం, సైదాబేగం 42 మందితో ఒక టెర్రర్ గ్రూప్ను ఏర్పాటు చేసి, సోషల్ మీడియాలో అనుమానాస్పద పోస్టులు చేస్తూ వచ్చినట్లు గుర్తించారు. ఏడాది క్రితం భర్తతో విడాకులు తీసుకున్న ఆమె ఒంటరిగా ఉంటూ రాత్రి సమయాల్లో ఎక్కువగా సోషల్ మీడియాలో టెర్రర్ సంబంధిత పోస్టింగ్లు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అలాగే ఈ కార్యకలాపాల కోసం ఆమె ప్రత్యేక నెట్వర్క్ను ఏర్పాటు చేసుకుని ప్రచారం చేసినట్లు విచారణలో బయటపడింది. యువతను ఉగ్రవాద వైపు ఆకర్షించేలా ఆమె పోస్టులు చేస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తున్నాయని దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
















.png&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!