

త్వరలోనే తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారబోతోందని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణకు చెందిన కేవలం 17 మంది మావోయిస్టులు మాత్రమే మిగిలి ఉన్నారని, వీరి వివరాలతో పోలీసుల వద్ద పూర్తి జాబితా ఉందని తెలిపారు. ఈ 17 మందిలో సెంట్రల్ కమిటీ, స్టేట్ కమిటీ, డివిజన్ కమిటీ సభ్యులు ఉండగా, ఒకరు అండర్గ్రౌండ్లో ఉన్నారు. వీరంతా లొంగిపోతే తెలంగాణ పూర్తిగా మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారుతుందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఆపరేషన్ కగార్ పూర్తయ్యేలోపే ఈ లక్ష్యాన్ని సాధించేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.
ఈ 17 మంది మావోయిస్టు అగ్రనేతలపై మొత్తం రూ.2.25 కోట్ల రివార్డు ప్రకటించబడింది. జాబితాలో సెంట్రల్ కమిటీ సభ్యులుగా ముప్పాల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జి, మల్లారెడ్డి రాజు అలియాస్ సంగ్రామ్, పసునూరి నరహరి అలియాస్ సంతోష్ ఉన్నారు. వీరిలో ఐదుగురు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి మిగిలిన మావోయిస్టులు లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!