మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగుండ్లలోని పగిడిద్ద రాజు ఆలయంలో రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవాళ మేడారం వైపు బయలుదేరనున్న పగిడిద్ద రాజు, రేపు సాయంత్రం సారలమ్మ గద్దెలకు చేరుకుని అక్కడ కొలువుదీరనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తిశ్రద్ధలతో సంప్రదాయ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం జరిగిన ఈ ప్రత్యేక పూజల్లో మంత్రి సీతక్క పాల్గొని, డోలు–సన్నాయి వాయిద్యాల నడుమ మహిళలతో కలిసి నృత్యం చేశారు. ఈ కార్యక్రమంలో మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్, పూజారులు తదితర ప్రముఖులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!