

ఇజ్రాయెల్–అమెరికా సంయుక్త దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతిపై వస్తున్న వార్తల నేపథ్యంలో పలు దేశాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్లో కూడా ఆందోళనలు కొనసాగాయి. నాంపల్లి ఎంఐఎం ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ నేతృత్వంలో వందలాది మంది షియా ముస్లింలు ఖమేనీ ఫోటోలు, నల్ల జెండాలతో ర్యాలీ నిర్వహించి ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మధ్యాహ్నం ప్రారంభమైన నిరసనలు అర్థరాత్రి వరకు కొనసాగడం చర్చనీయాంశంగా మారింది.
ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో హైదరాబాద్ నగరానికి ఇరాన్తో ఉన్న చారిత్రక అనుబంధాన్ని పలువురు గుర్తుచేస్తున్నారు. నగర నిర్మాణ శైలి, ఆహారం, సంస్కృతిలో ఇరానీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్ నగర రూపకర్తగా గుర్తింపు పొందిన మీర్ మోమిన్ అస్త్రాబాదీ నాటి పర్షియా (ఇరాన్) నుంచి వచ్చారని చరిత్ర చెబుతోంది. కుతుబ్ షాహీలు, అనంతరం పాలించిన నిజాంశాహీలు కూడా ఇరాన్ మూలాలు కలిగిన వంశాలే.
ఇరాన్తో ఉన్న స్నేహబంధానికి ప్రతీకగా నగరంలోని కొన్ని ప్రాంతాలకు ఆ దేశం పేర్లు కూడా ఉన్నాయి. పాతబస్తీలోని ఇరానీ గల్లీ అందుకు ఉదాహరణగా చెప్పబడుతోంది. అదేవిధంగా, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 7లో ఉన్న ఇరాన్ దౌత్య కార్యాలయం ప్రాంతానికి ఖమేనీ పేరు పెట్టిన విషయం కూడా ప్రస్తావనకు వస్తోంది.



.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!