
.jpg&w=3840&q=75)
సంక్రాంతి పండుగకు సిటీ నుంచి సొంతూళ్లకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, హైదరాబాద్ పోలీసులు కీలక భద్రతా సూచనలు జారీ చేశారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్ మాట్లాడుతూ, ఊరికి వెళ్లే ముందు తప్పనిసరిగా పక్కింటి వారికి లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. నగదు, బంగారు నగలు ఇంట్లో ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరచాలని, అవసరమైతే బీట్ ఆఫీసర్కు వివరాలు తెలియజేయాలని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 100కు ఫోన్ చేయాలని సూచించారు.
మరో వారం రోజుల్లో స్కూళ్లకు సెలవులు రావడంతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులతో బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఈ సమయంలో తాళాలు వేసిన ఇండ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు. అందుకే కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీల్లో సీసీ కెమెరాలు, వాచ్మన్ వ్యవస్థను పటిష్టం చేయాలని, ఇంట్లో ఒక గదిలో లైట్ వేసి ఉంచాలని, ప్రయాణ విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేయొద్దని సూచించారు. దొంగతనాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!