
న్యూస్

రూ.10,000 కంటే ఎక్కువ UPI ద్వారా పంపినప్పుడు కొత్త నిబంధనలను అమలు చేసే దిశగా RBI కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు ఈ కొత్త ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం డిజిటల్ చెల్లింపుల్లో పెరుగుతున్న ఫ్రాడ్ కేసులను తగ్గించడమే ఈ చర్య ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నారు.
ఈ ప్రతిపాదన ప్రకారం, రూ.10,000కు పైగా జరిగే డిజిటల్ ట్రాన్సాక్షన్లలో రిసీవర్ ఖాతాలో డబ్బు జమ కావడానికి సుమారు ఒక గంట సమయం పట్టేలా రూల్ ఉండొచ్చు. ఈ మధ్యలో, డబ్బు పంపిన వ్యక్తి తన నిర్ణయాన్ని మార్చుకుంటే ఆ ట్రాన్సాక్షన్ను రద్దు చేసుకునే అవకాశం కూడా కల్పించవచ్చు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!