

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. అమెరికా–ఇరాన్ మధ్య కాల్పుల విరమణ, శాంతి చర్చల కోసం జరుగుతున్న దౌత్య ప్రయత్నాలతో పరిస్థితి త్వరలో మెరుగవుతుందని అంతా భావించారు. అయితే తాజా అంచనాల ప్రకారం ఈ సమస్య మరో ఆరు నెలల వరకు కొనసాగవచ్చని తెలుస్తోంది. ముఖ్యమైన చమురు రవాణా మార్గమైన హర్మూజ్ జలసంధిని పూర్తిగా తిరిగి తెరవడానికి ఆరు నెలల సమయం పట్టొచ్చని పెంటగాన్ నివేదిక పేర్కొంది.
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం పెంటగాన్, అమెరికా చట్టసభ సభ్యుల మధ్య జరిగిన రహస్య సమావేశంలో డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కీలక నివేదికను సమర్పించింది. ఇరాన్ అమర్చిన సముద్ర మైన్స్ కారణంగానే హర్మూజ్ జలసంధి తెరవడంలో ఆలస్యం జరుగుతోందని నివేదిక తెలిపింది. ఇరాన్ 20కి పైగా మైన్స్ అమర్చినట్లు అంచనా వేయగా, వాటిలో కొన్ని జీపీఎస్ సాంకేతికతతో దూర ప్రాంతాల్లో అమర్చినట్లు పేర్కొంది. వీటిని గుర్తించడం, తొలగించడం కష్టంగా మారిందని నివేదిక స్పష్టం చేసింది. ఇరాన్తో యుద్ధం ముగిసిన తర్వాతే పూర్తి స్థాయి క్లియరెన్స్ ఆపరేషన్ సాధ్యమని తెలిపింది. అయితే ఈ నివేదికపై పెంటగాన్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

















.jpg&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!