

దావోస్ సమావేశాలు మరియు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా కంపెనీలతో కుదిరిన పెట్టుబడి ఒప్పందాల (ఎంఓయూ) అమలు పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పెట్టుబడులకు సంబంధించిన వివిధ రంగాల్లో ఇప్పటి వరకు స్థాపించబడిన సంస్థలు, ఇంకా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. ఫ్యూచర్ సిటీతో పాటు ఇతర ప్రాంతాల్లో కంపెనీలకు కేటాయించాల్సిన భూముల వివరాలు, ప్రాధాన్యతల ప్రకారం పంపిణీ పై కూడా చర్చ జరిగింది. ఎంఓయూ కుదుర్చుకున్న సంస్థలకు అవసరమైన భూముల భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.
అలాగే, కంపెనీలకు అందించాల్సిన మౌలిక వసతులు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. డేటా సెంటర్ల అవసరాల కోసం శుద్ధి చేసిన నీటిని ఎస్టీపీల ద్వారా అందించేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. పెట్టుబడి ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలను మూడు వర్గాలుగా విభజించి, ప్రముఖ బ్రాండ్ కంపెనీలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఎంఓయూ చేసిన సంస్థలు వీలైనంత త్వరగా తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సీఎం అధికారులకు ఆదేశించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!