

పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందుతున్న భారీ చిత్రం ‘వారణాసి’ మరోసారి వార్తల్లో నిలిచింది. దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.ఈ సినిమాకి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో కాగా, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రం గ్లోబల్ మార్కెట్ను టార్గెట్ చేస్తోంది.
ఇటీవల కొన్ని అంతర్జాతీయ ఈవెంట్లలో ఈ సినిమా కనిపించకపోవడంతో అభిమానుల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పుడు మెక్సికోలో జరగనున్న కామిక్ కాన్ ఎక్స్పీరియెన్స్ మెక్సికో వేదికపై ఈ సినిమా స్పెషల్ ఫుటేజ్ ప్రదర్శించనున్నట్టు సమాచారం.ఈ నెల 24న నిర్మాత ఎస్ ఎస్ కార్తికేయ ఈ ఫుటేజ్ను విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఈ ప్రదర్శనతో సినిమాపై గ్లోబల్ హైప్ మరింత పెరగనుంది.
ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని KL నారాయణ, కార్తికేయ ఐమ్యాక్స్ ఫార్మాట్లో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా భారతీయ సినిమా స్థాయిని మరింత పెంచేలా ఉండబోతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.






.webp&w=3840&q=75)















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!