

గోదావరి నదీ తీరంలోని ఆలయాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం పునరుద్ధరణ పనులకు భూమి పూజ నిర్వహించారు. గోదావరి పుష్కరాల నాటికి శాశ్వత సౌకర్యాలతో ఆలయాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రూ.198 కోట్ల వ్యయంతో చేపట్టిన పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అదే కార్యక్రమంలో కాళేశ్వరం బస్ స్టేషన్ నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి తదితరులు, ప్రజాప్రతినిధులు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ మరియు అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు ముఖ్యమంత్రి కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు వేదాశీర్వచనం అందించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!