

టర్కీ రాజధాని అంకారాలో చోటుచేసుకున్న ప్రైవేట్ జెట్ విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో లిబియా సైన్యాధ్యక్షుడు అలీతో పాటు మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు సైనిక అధికారులు, ముగ్గురు విమాన సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.
అధికారుల సమాచారం ప్రకారం, రన్వే పై నుంచి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. లిబియా సైన్యాధ్యక్షుడి మృతిని ఆ దేశ ప్రధాని అబ్దుల్-హమీద్ అధికారికంగా ధ్రువీకరించారు.
స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి, అలీతో పాటు నలుగురు అధికారులతో ప్రయాణిస్తున్న ఫాల్కన్ 50 ప్రైవేట్ జెట్ అంకారా విమానాశ్రయం నుంచి బయలుదేరింది. అయితే టేకాఫ్ అయిన సుమారు 42 నిమిషాల తరువాత విమానంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. దీంతో అధికారులు అప్రమత్తమై గాలింపు చర్యలు ప్రారంభించారు.
తర్వాత అంకారాకు నైరుతి దిశలో విమాన శిథిలాలను గుర్తించినట్లు వెల్లడించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాల పై అధికారులు లోతైన దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన పై లిబియా, టర్కీ ప్రభుత్వాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!