
న్యూస్

చేవెళ్ల ప్రమాదం షాక్ నుంచి బయటపడకముందే ఆంధ్రప్రదేశ్లో మరో బస్సు ప్రమాదం జరిగింది. ఏలూరు జిల్లాలోని లింగపాలెం మండలం జూబ్లీ నగర్ సమీపంలో భారతి ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు అదుపు తప్పి రోడ్డుపక్కన బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా, మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి పోలీసులకు సమాచారం అందించారు. గాయపడినవారిని లింగపాలెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 50 మంది ఉన్నట్లు సమాచారం.







.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!