
సినిమాలు

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ‘ఇరుముడి’ సినిమా ముగింపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆయన తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి సారించారు. యువ దర్శకులు హసిత్ గోలి, వివేక్ ఆత్రేయ వినిపించిన కథలు రవితేజను ఆకట్టుకున్నట్లు సమాచారం. వీటిలో మొదటిగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలోని చిత్రం పట్టాలెక్కనుందని తెలుస్తోంది.
ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. ప్రస్తుతం చేస్తున్న సినిమా పూర్తయ్యిన వెంటనే ఈ కొత్త ప్రాజెక్టును ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక హసిత్ గోలితో రవితేజ చేసే సినిమా వచ్చే ఏడాది మొదటిార్థంలో ప్రారంభమయ్యే అవకాశముంది. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించనున్నట్లు సమాచారం.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!