
సినిమాలు

వేసవి సెలవుల నేపథ్యంలో శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని స్వామివారి అలంకార దర్శనానికి దేవస్థానం అనుమతి కల్పించింది.
భక్తుల రద్దీ కారణంగా గత శుక్రవారం నుంచి నేటి వరకు సిఫార్సు లేఖల ఆధారిత ప్రత్యేక దర్శనాలను దేవస్థానం రద్దు చేసింది. అలాగే శని, ఆదివారాలు, సోమవారాల్లో నిర్వహించే ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలను తాత్కాలికంగా నిలిపివేశారు. ముందస్తుగా అంతర్జాలంలో స్పర్శ దర్శన టికెట్లు పొందిన భక్తులకు మాత్రమే రెండు విడతలుగా అనుమతి ఇస్తున్నారు. ప్రస్తుతం స్వామి, అమ్మవార్ల దర్శనానికి సుమారు ఐదు గంటల సమయం పడుతుండగా, శ్రీశైలం క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!