
జనరల్

విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ తీర రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కావడాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ జోన్ ప్రారంభం రాష్ట్రంలో రైల్వే అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, పరిపాలనా సామర్థ్యాన్ని పెంచి, ఆర్థికాభివృద్ధికి కొత్త ఊపునిస్తుందని ఆయన పేర్కొన్నారు. భారతీయ రైల్వేల్లో 18వ జోన్గా ఏర్పడిన ఈ దక్షిణ తీర రైల్వే జోన్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమతుల అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు.
ఈ చిరకాల ఆకాంక్షను సాకారం చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరియు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. దక్షిణ తీర రైల్వే జోన్ ప్రారంభం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గర్వకారణమైన చారిత్రాత్మక ఘట్టమని, రాష్ట్ర పురోగతికి ఇది కీలక మలుపుగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!