
సినిమాలు

ఘట్టమనేని జయకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రషా థడానీ హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని అశ్వనీదత్ సమర్పిస్తుండగా పి. కిరణ్ నిర్మిస్తున్నారు. మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా జూలైలో థియేటర్లలో విడుదల కానుంది.
కృష్ణ జయంతి సందర్భంగా ఈ చిత్ర యాక్షన్ టీజర్ను విడుదల చేశారు. జయకృష్ణ చెప్పే పవర్ఫుల్ డైలాగ్తో ప్రారంభమైన ఈ టీజర్ యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకుంది. చివర్లో సూపర్ స్టార్ కృష్ణకు అర్పించిన నివాళి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ నిర్మాణానంతర పనుల్లో ఉంది. ఈ చిత్రానికి సంగీతం జీవీ ప్రకాశ్ కుమార్ అందించగా, ఛాయాగ్రహణం జయకృష్ణ నిర్వహించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!