

ప్రపంచ చమురు మార్కెట్లలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ దేశంలో ఇప్పటికిప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగబోవని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. చమురు కంపెనీల వద్ద సరిపడా ముడి చమురు, శుద్ధి చేసిన ఇంధన నిల్వలు ఉన్నాయని తెలిపాయి. వచ్చే 6 నుంచి 8 వారాలకు సరిపడా నిల్వలు ఉండటంతో ప్రస్తుతం ధరలను పెంచే ఆలోచన లేదని వెల్లడించాయి. అంతర్జాతీయ మార్కెట్ల పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం పరిశీలిస్తున్నప్పటికీ ప్రస్తుత ఒత్తిడిని చమురు కంపెనీలు తాత్కాలికంగా భరిస్తాయని అధికారులు చెప్పారు.
ఇదిలా ఉండగా ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్ వ్యవధిని కూడా కేంద్రం పెంచింది. ఇప్పటివరకు ఉన్న 21 రోజుల వ్యవధిని 25 రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సిలిండర్ల నిల్వలను సమర్థంగా వినియోగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మరోవైపు ఖరీఫ్ సీజన్కు అవసరమైన ఎరువుల నిల్వలు కూడా దేశంలో తగినంతగా ఉన్నాయని ఫెర్టిలైజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 177.31 లక్షల టన్నుల ఎరువుల నిల్వలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!