
గాసిప్స్

ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరియు గద్దర్ అభిమానుల ఆకాంక్ష మేరకు, ఏపీలో గద్దర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆయన కూతురు వెన్నెల ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె సీఎం గారికి వినతి పత్రాన్ని సమర్పించారు.
అలాగే, ఆంధ్రా యూనివర్సిటీలోని ఆర్ట్ అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్కు గద్దర్ అన్న పేరు పెట్టాలని యూనివర్సిటీ ప్రొఫెసర్ల కోరిక మేరకు మరో వినతిని కూడా సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశం రాష్ట్ర సాంస్కృతిక రంగానికి గౌరవంగా ఉంటుందని ఆమె వివరించారు.
ఇదే సందర్భంలో, ప్రధాన జీవన ప్రవాహంలోకి వస్తున్న మావోయిస్టులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఈ అన్ని అంశాలపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!