

భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మందాన(Smriti Mandhana), సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ వివాహం వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆదివారం ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్న స్మృతి తండ్రి శ్రీనివాస్ మందాన గుండెనొప్పి లక్షణాలతో ఇబ్బంది పడ్డారు. దీంతో ఆయన్ను వెంటనే సాంగ్లీలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ పరిస్థితిలో పెళ్లిని వాయిదా వేస్తున్నట్టు మందాన తెలిపారని ఆమె మేనేజర్ ప్రకటించారు.
వీరి వివాహంపై తాజాగా పలాశ్ సోదరి, సింగర్ పలాక్ ముచ్చల్ ఇన్స్టా వేదికగా ఓ స్టోరీ షేర్ చేశారు. ఇరు కుటుంబాల ప్రైవసీని కాపాడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఆదివారం రాత్రి పలాశ్ ముచ్చల్ (Palash Muchhal) కూడా అనారోగ్యానికి గురవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైరల్ ఇన్ఫెక్షన్, ఎసిడిటీ వల్ల అతడు ఇబ్బంది పడ్డాడని వైద్యులు తెలిపారు. చికిత్స అనంతరం పలాశ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
అయితే ఈ విషయానికి సంబంధించి పలాశ్ సోదరి పలాక్ ముచ్చల్ ఇన్స్టా వేదికగా స్టోరీ పోస్ట్ చేశారు. అందులో ‘స్మృతి మంధాన నాన్నగారికి అనారోగ్యం కారణంగా, మందాన, పలాశ్ వివాహం ప్రస్తుతానికి ఆగిపోయింది. ఇలాంటి క్లిష్ట సమయంలో అందరూ ఇరు కుటుంబాల గోప్యత ను గౌరవించాలని కోరుతున్నా’ అని పలాక్ పేర్కొన్నారు.







.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!