
బిజినెస్

దేశంలో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు మరోసారి పెరగడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారులపై అదనపు ఆర్థిక భారం పడనుంది. చమురు మార్కెటింగ్ సంస్థలు 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరలను పెంచుతూ తాజా నిర్ణయం తీసుకున్నాయి. దీంతో వ్యాపార రంగంలో ఖర్చులు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
తాజా పెంపుతో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.42 పెరిగి రూ.3,113.50కు చేరింది. కోల్కతాలో కూడా ధరలు పెరిగి రూ.3,255.50 దాటాయి. అయితే గృహ వినియోగదారులు ఉపయోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!