
.webp&w=3840&q=75)
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన హై-వోల్టేజ్ భారత్-పాక్ మ్యాచ్పై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తామంటూ గత కొన్ని రోజులుగా భీష్మించుకు కూర్చున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB), అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) హెచ్చరికలతో ఎట్టకేలకు యూటర్న్ తీసుకుంది. టీ20 వరల్డ్ కప్ లో ఇండియాతో మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ అంగీకారం తెలపడంతో ఫిబ్రవరి 15న దాయాదుల పోరుకు లైన్ క్లియర్ అయ్యింది. బంగ్లాదేశ్కు మద్దతుగా భారత్తో మ్యాచ్ ఆడబోమని ప్రకటించిన పాక్పై ఐసీసీ తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చింది. మ్యాచ్ను బహిష్కరిస్తే భారీ జరిమానాతో పాటు నిషేధం విధించే అవకాశం ఉందని హెచ్చరించడంతో పాక్ ప్రభుత్వం దిగివచ్చింది. ఈ మేరకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సూత్రప్రాయంగా అంగీకారం తెలపడంతో, పీసీబీ తమ నిర్ణయాన్ని మార్చుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మెగా పోరు షెడ్యూల్ ప్రకారం జరగనుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!