

మేడారం మహాజాతరకు హాజరు కావాల్సిందిగా తెలంగాణ మంత్రులు మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్)ను ఆహ్వానించారు. ఆయన ఫామ్హౌస్లో స్వయంగా కలసి సంప్రదాయబద్ధంగా ఆహ్వానం అందజేశారు. అనంతరం మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీ సమావేశాల సమయంలో అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు ఆహ్వానాలు ఇచ్చామని, అయితే అప్పట్లో కేసీఆర్ను కలుసుకోలేకపోయామని తెలిపారు. అందుకే స్వయంగా వచ్చి ఆహ్వానించామని చెప్పారు.
సమ్మక్క–సారలమ్మలకు అంకితమైన మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా గుర్తింపు పొందిందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ప్రాంతాలకు అతీతంగా అందరి కోరికలు తీర్చే తల్లులుగా సమ్మక్క–సారలమ్మలను భక్తులు భావిస్తారని తెలిపారు. కేసీఆర్, ఆయన సతీమణి శోభమ్మకు సంప్రదాయంగా చీరలు, బంగారాన్ని బహుకరించి మేడారం రావాల్సిందిగా కోరగా, కేసీఆర్ సానుకూలంగా స్పందించి జాతరకు వస్తానని హామీ ఇచ్చారని వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర పండుగగా జాతరను నిర్వహిస్తున్నామని ఆమె స్పష్టం చేశారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!