
టెక్నాలజీ

ముంబైలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ ఒక్కసారిగా కూలిపడి కారు, ఆటో రిక్షాపై పడింది. ఈ ఘటనతో రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పిల్లర్ కూలిన సమయంలో వాహనాల్లో ఉన్నవారు చిక్కుకుపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మరియు సహాయక సిబ్బంది గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించామని అధికారులు వెల్లడించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!