
క్రీడలు

ప్రదీప్ రంగనాథన్ నటించిన “లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ” సినిమా, విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కి మిక్స్ టాక్ను అందుకుంది. వరుస హిట్స్ తర్వాత వచ్చిన ఈ సినిమా మొదటి రోజే ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను ఎక్కువగా ఇష్టపడకపోయినా, తమిళనాడులో మాత్రం కొంతవరకు నడుస్తోంది.
ఇదిలా ఉండగా, వారం రోజుల్లోనే ఈ సినిమా ₹54.3 కోట్ల వరల్డ్వైడ్ గ్రాస్ సాధించిందని మేకర్స్ చెప్పారు. ఇండియాలో సుమారు ₹40 కోట్ల వరకు వసూళ్లు వచ్చాయని తెలిపారు. కానీ ఈ సంఖ్యలపై చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మిక్స్ టాక్ ఉన్నప్పటికీ ఇంత కలెక్షన్స్ రావడం నమ్మలేకపోతున్నారని అంటున్నారు. కొందరు ఇది పబ్లిసిటీ కోసం చెప్పిన నెంబర్లేనని కూడా కామెంట్స్ చేస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్గా నటించిన ఈ సినిమా తర్వాత ఎలా ప్రదర్శన ఇస్తుందో చూడాలి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!