
_2K.png&w=3840&q=75)
ద్రౌపది ముర్ము ప్రత్యేకంగా బ్రహ్మానందంను కలిశారు. గత మూడు రోజులుగా హైదరాబాద్ లో పర్యటిస్తున్న రాష్ట్రపతి, శుక్రవారం రామోజీ ఫిల్మ్ సిటీ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఇతర కార్యక్రమాలకు హాజరైన ఆమె, ఆదివారం హైదరాబాద్లోని రాష్ట్రపతి నిలయంలో విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం రాష్ట్రపతిని కలిసి, ఆమె చేతుల మీదుగా శాలువాతో సత్కారం పొందారు. ప్రతిగా ఆయన స్వహస్తాలతో చిత్రించిన ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని ఆమెకు బహూకరించారు.
నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన సుదీర్ఘ సినీ ప్రయాణంతో, దాదాపు మూడు దశాబ్దాల పాటు తెలుగులో తిరుగులేని నంబర్ వన్ కమెడియన్గా బ్రహ్మానందం ఆధిపత్యం చెలాయించారు. తరతరాల ప్రేక్షకులను ఒకేలా నవ్వించగల అరుదైన ప్రతిభతో తెలుగు సినిమాకు ప్రత్యేక గుర్తింపునిచ్చారు. అనేక చిత్రాల్లో హీరోలకన్నా ఎక్కువగా ప్రేక్షకులను అలరించి, ఆయా సినిమాల విజయాల్లో కీలక పాత్ర పోషించారు.
మధ్యలో కొంత గ్యాప్ వచ్చినప్పటికీ, ఇటీవల మళ్లీ సినిమాల్లో చురుకుగా కనిపిస్తూ తనదైన హాస్యంతో ప్రేక్షకులను నవ్విస్తున్నారు. తాజాగా గుర్రం పాపిరెడ్డి చిత్రంలో జడ్జి పాత్రలో ఆయన చేసిన కామెడీకి మంచి స్పందన లభించింది. సినిమా రంగానికే కాకుండా ఇతర రంగాల్లోనూ ఆయనకు అపారమైన గౌరవం ఉంది. ఆయన ప్రతిభ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.
బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరొందిన బ్రహ్మానందం, తీరిక వేళల్లో చిత్రకళపై ఆసక్తితో బొమ్మలు గీయడం తెలిసిందే. ప్రముఖులకు, సన్నిహితులకు తన కళాకృతులను బహుమతిగా అందించడం ఆయనకు అలవాటు. రాష్ట్రపతిని కలిసిన సందర్భంలోనూ ఈ ప్రత్యేక జ్ఞాపికను అందజేసి, తన కళాప్రతిభను మరోసారి చాటుకున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!