
న్యూస్

కనీస వేతనాల కోసం నోయిడాలో కార్మికులు నిర్వహిస్తున్న ఆందోళనలు ఈ వారం హింసాత్మకంగా మారాయి. ఫేజ్ 2 ప్రాంతంలో నిన్న కార్మికులు ప్రభుత్వ వాహనాలు, ఆస్తులను తగలబెట్టడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అనంతరం కార్మికులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
ఈరోజు సెక్టార్ 80 లో మళ్లీ రోడ్లపైకి వచ్చిన కార్మికులు కనీసం ఇరవై వేల రూపాయల జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిస్థితులు అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు. తక్కువ జీతాలు, అలవెన్సులు, ఓవర్టైమ్ చెల్లింపుల లోపం, ఉద్యోగుల తొలగింపులు వంటి సమస్యలపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం నలభై ఐదు వేల మంది ఈ ఆందోళనలో పాల్గొనగా, పోలీసులు ఇప్పటివరకు మూడు వందల యాభై మందిని అరెస్టు చేశారు.














.jpg&w=3840&q=75)







కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!