

అమెరికా మరియు ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, చాలా కాలం తర్వాత ఇరాన్ నుంచి భారత్కు మళ్లీ ముడి చమురు సరఫరా ప్రారంభమైంది. డొరేనా అనే భారీ ఇరాన్ నౌక సుమారు రెండు మిలియన్ బ్యారెళ్ల ముడి చమురుతో భారత తీరానికి చేరుకుంటోంది.
ట్యాంకర్ ట్రాకింగ్ వ్యవస్థల ప్రకారం ఈ నౌక భారత్ దక్షిణ తీరానికి సమీపంలో ఉంది. హైదరాబాద్లోని ఇరాన్ కాన్సులేట్ కార్యాలయం కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఈ చమురు సరఫరా దక్షిణ తీరంలోని ఒక రిఫైనరీకి చేరనుంది. గత వారం రోజుల్లో ఇది ఇరాన్ నుంచి వచ్చిన మూడో నౌక కావడం విశేషం. దీంతో మొత్తం ఆరు మిలియన్ బ్యారెళ్ల చమురు భారత్కు వచ్చినట్లు అవుతుంది.
అమెరికా ఆంక్షలు మరియు అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య కూడా ఈ సరఫరా జరగడం ముఖ్యమైన విషయం. 2019 తర్వాత అమెరికా ఆంక్షల కారణంగా భారత్ ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేయడం నిలిపివేసింది. కానీ ఇటీవల ఆంక్షలు కొంత సడలడంతో భారత రిఫైనరీలు మళ్లీ కొనుగోలు ప్రారంభించాయి. దాదాపు ఏడేళ్ల తర్వాత ఇరాన్ చమురు మళ్లీ భారత్కు చేరడం ఇదే మొదటిసారి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!