

రష్యా ఉక్రెయిన్లోని జనావాస ప్రాంతాలపై భారీ దాడులు జరిపింది. దాదాపు 700 డ్రోన్లు, డజన్ల కొద్దీ క్షిపణులతో పలు గంటలపాటు దాడులు కొనసాగాయి. ఈ దాడుల్లో కనీసం 16 మంది మరణించగా, 80 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. 17 అపార్ట్మెంట్ భవనాలు, 10 ఇళ్లు, ఒక హోటల్, ఒక షాపింగ్ మాల్ సహా పలు నిర్మాణాలు దెబ్బతిన్నాయి. గత రెండు వారాల్లో ఇదే అతిపెద్ద దాడిగా అధికారులు పేర్కొన్నారు.
ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపిన వివరాల ప్రకారం, 667 డ్రోన్లు (వాటిలో 636 షహెద్ రకం) మరియు 31 క్షిపణులను గాలిలోనే నిర్వీర్యం చేసినప్పటికీ, కొన్ని లక్ష్యాలను తాకి నష్టం కలిగించాయి. వోలోడిమిర్ జెలెన్స్కీ ఇటీవల జర్మనీ, నార్వే, ఇటలీలను సందర్శించి వైమానిక రక్షణ సహాయం కోరారు. ఈ నేపథ్యంలోనే రష్యా దాడులు పెరిగినట్లు నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు ఉక్రెయిన్కు సైనిక సహాయం అందిస్తున్న యూరప్ దేశాలపై కూడా లక్ష్యంగా చేసుకుంటామని రష్యా హెచ్చరించడం ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!