
గాసిప్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భారత పేసర్ అర్ష్దీప్ సింగ్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటికే 100 వికెట్లు సాధించిన ఈ ఎడమచేతి పేసర్, ఇప్పుడు ఐపీఎల్లోనూ 100 వికెట్ల క్లబ్లో చేరి తన ప్రతిభను మరోసారి నిరూపించాడు.
పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న అర్ష్దీప్, ముంబై ఇండియన్స్ బ్యాటర్ రియాన్ రికెల్టన్ను ఔట్ చేసి ఈ మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన ఐదో బౌలర్గా నిలిచాడు. భారత ఆటగాళ్లలో జహీర్ ఖాన్, అశిష్ నెహ్రా, జయదేవ్ ఉనాద్కాట్ తర్వాత ఈ జాబితాలో చోటు సంపాదించాడు. ప్రస్తుతం ట్రెంట్ బౌల్ట్ 144 వికెట్లతో ముందంజలో ఉన్నాడు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!