.png&w=3840&q=75)

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశంలోని పలు ప్రాంతాల్లో వంటగ్యాసు (ఎల్పీజీ) సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గ్యాస్ ఏజెన్సీల వద్ద ప్రజలు భారీగా బారులు తీరుతున్నారు. ముఖ్యంగా ముంబయి, ఢిల్లీ, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో వాణిజ్య సిలిండర్లు నల్లబజారులో అమ్ముడవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనివల్ల పలు హోటళ్లు, రెస్టారెంట్లు తాత్కాలికంగా కార్యకలాపాలు నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశంలో చమురు మరియు ఎల్పీజీ నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో సరఫరా సమస్యలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రత్యామ్నాయంగా హోటళ్లు ఇండక్షన్ స్టౌలు, మైక్రోవేవ్ అవెన్ల వాడకాన్ని ప్రారంభిస్తున్నాయి. అయోధ్యలోని ప్రసిద్ధ అమావా ఆలయంలో ఉన్న ‘రామ్ రసోయీ’ అన్నదాన కేంద్రాన్ని కూడా తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలో నల్లబజారు విక్రయాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గృహ వినియోగదారుల కోసం ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది. వాణిజ్య సిలిండర్ల సరఫరా పరిస్థితిని సమీక్షించేందుకు చమురు మంత్రిత్వశాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. బుక్ చేసిన రెండున్నర రోజుల్లో గృహ వినియోగదారులకు సిలిండర్ అందే విధానాన్ని కొనసాగిస్తున్నామని అధికారులు తెలిపారు. హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహించి గృహ వినియోగదారులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ఇదే సమయంలో గ్యాస్ కొరత విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. వాస్తవాలను దాచిపెట్టి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపిస్తూ పార్లమెంట్ ముందు కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు.

.png&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!