.webp&w=3840&q=75)
న్యూస్

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘డేవిడ్ రెడ్డి’ చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అయితే ఫైనల్ కట్ చూసిన తర్వాత కథను మరింత బలంగా చూపించేందుకు కొన్ని సన్నివేశాలను మళ్లీ చిత్రీకరించాలని మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం.
ప్రత్యేకంగా ఇంటర్వెల్ ఎపిసోడ్పై దర్శకుడు హనుమరెడ్డి యక్కంటి మరింత దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కథలో కీలక మలుపు తీసుకువచ్చే ఈ భాగాన్ని మరింత పవర్ఫుల్గా తీర్చిదిద్దేందుకు రీషూట్ చేయనున్నారని టాక్. బ్రిటిష్ పాలన కాలం నేపథ్యంలో స్వాతంత్ర్య పోరాటాన్ని ఆధారంగా తీసుకుని ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో ‘వార్ డాగ్’ అనే ప్రత్యేక వాహనం కూడా ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ మార్పులతో సినిమా మరింత ప్రభావవంతంగా మారుతుందని చిత్రబృందం నమ్మకం వ్యక్తం చేస్తోంది.










.webp&w=3840&q=75)





.webp&w=3840&q=75)





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!