
న్యూస్
.webp&w=3840&q=75)
రాష్ట్రంలో ప్రజల అర్జీలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజావాణి సేవలను క్షేత్రస్థాయికి విస్తరించాలని సూచిస్తూ, ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా తమ సమస్యలను సులభంగా పరిష్కరించుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
వెంటనే రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి ప్రారంభించాలని, తరువాత దశలో మండల స్థాయికి విస్తరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును నమోదు చేసి, సంబంధిత విభాగాలకు పంపించి నిర్ణీత గడువులో పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఫిర్యాదుల పరిష్కారానికి ఏకీకృత డిజిటల్ వ్యవస్థ, ప్రతి స్థాయిలో నోడల్ అధికారులు, ఆటో ఎస్కలేషన్ విధానం ఏర్పాటు చేయాలని సూచించారు.














.jpg&w=3840&q=75)
.webp&w=3840&q=75)





.webp&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!