
న్యూస్

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో దక్షిణ భారతదేశం మరియు శ్రీలంకలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. ఈ ప్రభావంతో తమిళనాడు మరియు శ్రీలంకలో అనేక ప్రాంతాల్లో జోరువానలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండటం వల్ల సాధారణ జీవన విధానం దెబ్బతింటోంది. ఈ వ్యవస్థ మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఇక ఈనెల 25 నుంచి 28 వరకు తెలంగాణలో తేలికపాటి జల్లులు పడే అవకాశముంది. పలుచోట్ల మేఘావృతమైన ఆకాశం కనిపించడంతో పాటు ఎప్పటికప్పుడు చిరుజల్లులు కురిసే సూచనలు ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణకు పెద్ద ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకపోయినా ప్రజలు వాతావరణ సూచనలను గమనించాలని అధికారులు సూచిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!