.jpeg&w=3840&q=75)
.jpg.webp&w=3840&q=75)
పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు తొలిసారి ఫోన్ ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, అలాగే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం అంశాలపై ఇద్దరు నేతలు విస్తృతంగా చర్చించారు. సుమారు 40 నిమిషాల పాటు సాగిన ఈ ఫోన్ సంభాషణలో హార్ముజ్ జలసంధిని తెరిచి ఉంచడం, నౌకల రాకపోకలు సురక్షితంగా కొనసాగాల్సిన అవసరాన్ని ఇద్దరూ ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఈ ఫోన్ సంభాషణపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. రెండు దేశాల మధ్య వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని సమగ్రంగా చర్చించామని, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులపై కూడా చర్చించామని, హార్ముజ్ జలసంధిని తెరిచి, సురక్షితంగా ఉంచడం అత్యంత అవసరమని తాము భావిస్తున్నామని పేర్కొన్నారు.
ఇక ఈ ఫోన్ సంభాషణను భారత్లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ కూడా ధృవీకరించారు. ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ కొద్ది నిమిషాల క్రితమే ఫోన్లో మాట్లాడారని ఆయన తెలిపారు. పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలతో పాటు, వాషింగ్టన్లో భారత్–అమెరికా మధ్య కొనసాగుతున్న కొన్ని కీలక అంశాలపై కూడా అధ్యక్షుడు తాజా సమాచారం అందించారని సెర్గియో గోర్ వెల్లడించారు.










.jpeg&w=3840&q=75)







.jpg.webp&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!