

టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. తన సోదరుడిని కోల్పోవడంతో రాహుల్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ‘పారాక్వాట్’ అనే ప్రమాదకర గడ్డి మందు కారణంగా ఆయన సోదరుడు మరణించినట్లు తెలిపారు. ఈ విషయం సోషల్ మీడియాలో పంచుకోవడంతో సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు.
పారాక్వాట్ అనేది వ్యవసాయంలో కలుపు మొక్కలను నివారించడానికి వాడే రసాయనం. దీనికి ఎలాంటి విరుగుడు లేకపోవడం వల్ల ఇది చాలా ప్రమాదకరం. శరీరంలోకి వెళ్లిన తర్వాత కొన్ని గంటల్లోనే ఊపిరితిత్తులు, కిడ్నీలు, కాలేయం వంటి అవయవాలను దెబ్బతీస్తుంది. ఈ కారణంగా మరణాలు పెరుగుతున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని రాహుల్ తెలిపారు.
తన బాధలోనూ సమాజం కోసం రాహుల్ స్పందించారు. పారాక్వాట్ను వెంటనే నిషేధించాలని కోరుతూ ప్రధాని కార్యాలయం, తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయాలకు లేఖ రాశారు. ఇప్పటికే అనేక దేశాల్లో నిషేధించిన ఈ రసాయనం మన దేశంలో ఇంకా అందుబాటులో ఉండడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పారాక్వాట్ను నిషేధించాలి ప్రచారం వేగంగా జరుగుతోంది.





.jpeg&w=3840&q=75)



.jpg&w=3840&q=75)


.jpg.webp&w=3840&q=75)




.jpeg&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!